గోదావరి నదిలో 61 మందితో వెళుతున్న రాయల్ వశిష్ఠ అనే లాంచీ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణకు చెందినవారు 21 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో వరంగల్ కు చెందినవారు 14 మంది ఉండగా..మిగతావారు హైదరాబాద్ కు చెందినట్లు సమాచారం. వరంగల్ రూరల్ జిల్లా కడిపికొండ మహరాజు కాలనీకి చెందిన 14మంది పాపికొండలు టూర్ కి వెళ్లి ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.
అయితే వరంగల్ కు చెందినవారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, 9 మంది గల్లంతయ్యారు. హైదరాబాద్ వాసుల పరిస్థితి తెలియరాలేదు. ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు గుర్తించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
రథం దగ్ధంపై చంద్రబాబు కమిటి..విజయసాయి విమర్శలు