telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్‌‌లో రేపు మంచినీటి సరఫరా బంద్‌

Tap Connections in 18 Days in Hyderabad

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు తాగునీటి సరఫరా ఉండదని వాటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. 33 కేవీ మంజీరా ఫీడర్‌, 132 కేవీ ఆర్సీపురం, 132 కేవీ పాశంమైలారం ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు మరమ్మతుల నేపథ్యంలో 24వ తేదీన పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఉండదని వాటర్‌బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ మరమ్మతుల కారణంగా బీహెచ్‌ఈఎల్‌ ప్యాక్టరీ, మాక్స్‌ సొసైటీ-1, 2, అశోక్‌నగర్‌ హెచ్‌ఐజీ, హెచ్‌సీయూ, ఎస్‌బీఐటీ, మదీనాగూడ, హెచ్‌ఐజీ, పి.సత్యనారాయణ ఎన్‌క్లేవ్‌, మియాపూర్‌, ఆర్సీపురం, అశోక్‌నగర్‌, చందానగర్‌, అమీన్‌పూరా, హుడాకాలనీ, పీజేఆర్‌ కాలనీ, దీప్తిశ్రీనగర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో గురువారం మంచినీటి సరఫరా అధికారులు ప్రకటించారు.

Related posts