రాజ్భవన్లో పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రతి ఏడాది ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది కూడా రాజ్భవన్ ఇఫ్తార్ విందు ఇవ్వడానికి రాజ్భవన్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విందులో పాల్గొనటానికి శనివారం సాయంత్రం ఏపీ సీఎం జగన్ హైదరాబాద్కు రానున్నారు. ఇఫ్తార్ విందుకు ఆయన హాజరుకానున్నారు.
జూన్ 3న గుంటూరులో ప్రభుత్వం ఇఫ్తార్ విందు వివ్వనుంది. ఈ కార్యక్రమానికి కూడా జగన్ హాజరుకానున్నారు. వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత జగన్ తన ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ ఆహ్వానించడానికి హైదరాబాద్ వచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎంగా జగన్ హైదరాబాద్ వస్తున్నారు.