telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

రేపు గుంటూర్ లో మోదీ సభ.. మూడు హెలిఫ్యాడ్‌లు సిద్దం

pm modi fire pulvama terror attacks
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో భాగంగా రేపు  గుంటూరు రానున్నారు. నగర శివారులోని ఏటుకూరు బైపాస్‌ వద్ద ఆదివారం బీజేపీ నిర్వహించనున్న ‘సత్యమేవ జయతే’ సభకు మోదీ హాజరవుతున్నారు. ఈ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నాయి. సభా ప్రాంగణానికి వాజపేయి ప్రాంగణంగా నామకరణం చేశారు. మోదీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 
మోదీ ఉదయం 11.10 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో రూ.5, 300 కోట్ల అంచనా వ్యయంతో కేజీ బేసిన్‌లో ఏర్పాటు చేసిన గ్యాస్ ఫీల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుని గుంటూరు సభ వేదిక నుంచే ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మోదీ రాకను వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసనలకు దిగనున్న నేపథ్యంలో ఎప్పీజీ అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. సభా ప్రాంగణం ఆవరణలో మూడు హెలిఫ్యాడ్‌లు సిద్ధం చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ డీజీ రవి శంకర్ అయ్యన్నార్ పర్యవేక్షణలో 1,700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Related posts