ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంజిల్లాలో రేపు బ్యాంకు పోస్టులకు జాబ్మేళా నిర్వహించనున్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సాయి సిద్ధార్థ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 15న జాబ్మేళా నిర్వహించనున్నట్లు ప్రాజక్ట్ డైరెక్టర్ శ్రీకాంత్రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్రెడ్డి, సీఈఓ రాజగోపాల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారుబ్యాంకింగ్ రంగంలో క్యాషియర్ పోస్టులకు మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. డి గ్రీ, బీటెక్ అర్హత ఉండి, 1994 ఫిబ్రవరి 1 తర్వాత జన్మించిన. వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 8247410655, 9676292629 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.