telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

డాటా ధర తగ్గింది.. ట‌మాటా ధర పెరిగింది.. ఢిల్లీలో కేజీకి రూ.80

tamata market

వివిధ నెట్వర్క్ కంపెనీలు పోటీ పడి డాటా ధరలను తగ్గిస్తున్నప్పటికీ కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనా ధరలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా టమాటాలు అధికంగా ధర పలుకుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మొన్నటి వరకు కేజీకి రూ.30 పలికిన టమాటా ఇప్పుడు ఏకంగా రూ.60 నుంచి రూ.80 వరకు అమ్ముడవుతోంది. తాజాగా కురిసిన భారీ వర్షాల వల్లే పెద్ద ఎత్తున టమాటా పంట నాశనమైందని, అందుకునే దిగుబడి తక్కువగా వచ్చిందని, దీంతో ధర బాగా పెరిగిందని వ్యాపారులు అంటున్నారు.

Related posts