ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకొన్నారు. 2017లో ఆయన భార్య అనిత అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నారు. భార్య మృతితో మానసికంగా దిల్ రాజు కుంగిపోవడంతో ఆయనకు తోడు కావాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. పెళ్లికి ఒప్పించారు. లాక్డౌన్ కొనసాగుతున్న వేళ దిల్ రాజు తన వివాహాన్ని ఎలా ఆర్భాటం లేకుండా నిజామాబాద్లో పెళ్లి చేసుకున్నారు. తన పెళ్లి విషయాన్ని ఆదివారం ఆయనే స్వయంగా వెల్లడించారు. దిల్ రాజు వివాహానికి సినీ ప్రముఖులు సైతం దూరంగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా కుటుంబ సభ్యుల్లో కొంతమందిలో మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. కొన్నిరోజులుగా దిల్ రాజు పెళ్లి వార్త సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపించింది. దిల్ రాజు రెండోపెళ్లికి సంబంధించి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
వాలంటీర్ల అరాచాకాలు ముఖ్యమంత్రికి కనిపించటం లేదా? – బండారు శ్రావణి