“ఈ ఏడాది అందరూ సమస్యల్లో మునిగి ఉన్నారు. కొందరు ఆన్లైన్లో ఒకరి మనోభావాలను మరొకరు దెబ్బతీస్తున్నారు. అందరూ కలిసి అభివృద్ధి సాధించాల్సిన ఈ క్లిష్ట సమయంలో విద్వేషాన్ని పెంచే ధోరణి సరికాదు. ఓపిక, దయ, అర్థం చేసుకునేతత్వాన్ని మరింత పెంచుకుంటూ ముందుకెళ్దాం..” అని పారిశ్రామికవేత్త రతన్ టాటా వ్యాఖ్యలతో తనకు జ్ఞానోదయం అయినట్లుగా బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘ఆన్లైన్లో ద్వేషాన్ని ఆపండి’ అనే టైటిల్తో న్యూస్ పేపర్లో వచ్చిన రతన్ టాటా మాటల్ని షేర్ చేసిన బండ్ల గణేష్ అందరినీ క్షమించమని కోరారు. “తెలిసి తెలియక నేనేమన్నా ఎవరినైనా బాధపెట్టినా, తప్పు చేసినా.. పెద్ద మనసుతో క్షమించండి.. మీ బండ్ల గణేష్” అని బండ్ల గణేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
తెలిసి తెలియక నేనేమన్నా ఎవర్నన్నా బాధపెట్టిన తప్పు చేసిన పెద్ద మనసుతో క్షమించండి మీ బండ్ల గణేష్🙏 pic.twitter.com/5bin6DMfIJ
— BANDLA GANESH. (@ganeshbandla) June 27, 2020