telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

దర్శకుడు తేజకు కరోనా

Teja

సినీ ప్రముఖులు వరుసబెట్టి కరోనా బారిన పడుతుండటంతో ఇండస్ట్రీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతుండగా తాజాగా దర్శకుడు తేజ కరోనా పడ్డారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ తీస్తున్న తేజ.. ఆ పని నిమిత్తం ఇటీవల ముంబై కి వెళ్లి వచ్చారని తెలిసింది. అక్కడే ఆయన కరోనా బారిన పడి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలసిన వారు పరీక్షలు చేయించు కోవాలని, స్వీయ నిర్బంధం పాటించాలని తేజ కోరారు. తేజ బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ తో తీసిన ‘సీత’ మూవీ తర్వాత మరో సినిమా చేయలేదు. అది పరాజయం పొందటంతో కాస్త విరామం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ హీరోగా ‘అలివేలు మంగ వెంకట రమణ ‘ అనే సినిమాతో పాటు రానాతోనూ ఓ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా కారణంగా సినిమాలేవీ షూటింగ్ చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆయన వెబ్ సీరిస్ కు ప్లాన్ చేసి వర్క్ చేస్తూ వచ్చారు.

Related posts