ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం ఆయన మరణించారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. అతడికి భార్య శ్రీవాణి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1979లో సూర్య పేట్ జిల్లాలో కోదాడ మండలంలో జన్మించిన ఆయన నాల్గవ ఏట నుండే మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన ‘సంప్రదాయం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వేణుమాధవ్. ‘తొలిప్రేమ’ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ‘లక్ష్మీ’ సినిమాకి ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘సంక్రాంతి, ‘హంగామా’, ‘పోకిరి’, ‘దిల్’ ఇలా పలు సినిమాలలో హాస్య నటుడిగా కనిపించి మెప్పించాడు.
previous post