ఈరోజు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. 73 ఏళ్ల వయసులోనూ స్టార్ యాక్టర్ కోట శ్రీనివాసరావు ఓటు వేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫిల్మ్నగర్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో నిర్మాత శ్యామ్ ప్రసాద్రెడ్డి, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓటువేశారు. నటులు రాజేంద్ర ప్రసాద్, బెల్లంకొండ శ్రీనివాస్, రామ్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్, నిఖిల్, కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటి మంచు లక్ష్మి, యాంకర్ ఝాన్సీ, దర్శకుడు క్రిష్, తేజ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ క్లబ్ లో హీరో రాజశేఖర్, జీవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. నా భర్త ఆరోగ్యం బాగోలేక పోయినా.. ఓటు వేయడానికి వచ్చారు.. ఇళ్లల్లో కూర్చున్న వాళ్లు గడప దాటండి.. ఓటు వేయండి.. బూత్ లు ఖాళీగా ఉన్నాయి అంటూ జీవిత అన్నారు.
previous post
ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్లకే..కేసీఆర్ పై పొన్నాల విమర్శలు