శ్రీరామ చంద్రుడి జన్మస్థలం అయోధ్య నగరంలో రామ మందిర ఆలయ నిర్మాణానికి ఈ రోజు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమి పూజ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “అయోధ్య రాముడు ఆనందించేలా.. భారతదేశం గర్వించేలా.. ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా.. ఎదురులేని తిరుగులేని మొక్కవోని సాహసంతో పుణ్యకారం తలపెట్టిన పుణ్యాత్ములందరికీ శతథా.. సహస్రథా.. వందనం.. అభివందనం” అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
అయోధ్య రాముడు ఆనందించేలా
భారతదేశం గర్వించేలా
ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా
ఎదురులేని తిరుగులేని మొక్కవోని సాహసంతో
పుణ్యకారం తలపెట్టిన పుణ్యాత్ములందరికీ
శతథా సహస్రథా
వందనం అభివందనం.#JaiShriRam #AyodhyaBhoomipoojan #AyodhyaRamMandir pic.twitter.com/ELAhGhsCBL— Mohan Babu M (@themohanbabu) August 5, 2020