telugu navyamedia
సినిమా వార్తలు

నేడు ఈడీ ముందుకు నటుడు నవదీప్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ దూకుడు పెంచింది. ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటిసులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో నే డు ఈడీ విచారణకు నటుడు నవదీప్ హాజరుకానున్నారు. ఈయనతోపాటు ఎఫ్ఎం క్లబ్ జనరల్ మేనేజర్ ను కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది. తాజాగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి కూడా నవదీప్ ను ప్రశ్నించనున్నారు.

Actor Navdeep to play host

ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి వారి వారి అకౌంట్లలో అనుమానస్పదంగా ఉన్న లావాదేవీలపై అడిగి తెలుసుకున్నారు. కెల్విన్‌, వాహిద్‌ ఎంత కాలంగా వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారా, నగదు బదిలీ ఏ విధంగా చేశారు, ఎంత నగదు చెల్లించారు… అనే విషయాలపై ఈడీ అధికారులు లోతుగా ఆరా తీశారు. ఖాతా వివరాలపై స్పష్టత వచ్చాక మరికొంత మందికి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరే అవకాశం ఉంది. వరుస సెలవులు రావడంతో ఈడీ అధికారులు విచారణకు మూడు రోజుల విరామం ఇచ్చారు.

Exclusive Interview : Navdeep- I am no more a bad boy | 123telugu.com

 ఇటీవ‌ల‌ పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్, నందు, రానా దగ్గుబాటిలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. వారికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, మనీ లాండరింగ్ పై సెలబ్రెటీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈరోజు విచారణకు వచ్చే నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ పై ఈడీ అధికారులు కాస్త ఎక్కువగానే ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది.

Related posts