ఎపీలో నూతనంగా ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వం గ్రామ వలంటీర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వలంటీర్ల ఎంపిక కోసం నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి జూలై 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
జూలై 10 వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. మండల ఎంపిక కమిటీ జూలై 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. ఎంపికైన వలంటీర్లకు ఆగస్టు 1 నాటికి సమాచారం ఇస్తారు. ఆగస్టు 5 నుంచి 10 వరకు ఎంపికైన వలంటీర్లకు శిక్షణ తరగతులను నిర్వహిస్తారు. ఆగస్టు 15 నుంచి వారికి పోస్టింగ్ ఇచ్చిన గ్రామాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.
బాబు టూర్ ముగిసేలోపే ఏపీ ముఖచిత్రం మారిపోతుంది: విష్ణువర్థన్రెడ్డి