ఎంతో కాలంగా ఎదిరిచూస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, మాదాపూర్ ప్రాంత వాసులకు మెట్రో అధికారులు గుడ్న్యూస్ చెప్పారు. నేటినుంచి మాదాపూర్లో మెట్రోరైలు అందుబాటులోకి రానుందని తెలిపారు. రివర్స్ ట్రాకింగ్ లేకపోవడంతో ఇంతకాలం మాదాపూర్లో మెట్రోరైలు ఆగలేదు.
హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల నుంచి నిత్యం వందల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాదాపూర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తారు. ఇన్నాళ్ళు మెట్రో స్టాప్ అక్కడ లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఎట్టకేలకు నేటినుంచి మాదాపూర్లో రైలు ఆగనుండడంతో ఉద్యోగులు, సామాన్యులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.