telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ లో నేటి నుంచే పసుపు-కుంకుమ పంపిణీ 

Chandrababu Comments Jagan KCR
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపడచుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు-కుంకుమ పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది.  ప్రభుత్వ ఆదేశాల మేరకు  మూడు రోజుల పాటు పెన్షన్లు, డ్వాక్రా, మెప్మా మహిళలకు పసుపు – కుంకుమ నగదు పంపిణీ చేయబోతున్నారు. లబ్ధిదారులకు నగదు అందజేయడానికి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. 
లబ్ధిదారులకు రూ.3వేల చొప్పున పంపిణీ చేయడానికి రూ.2వేల నోటు ఒకటి, రూ.500 నోట్లు రెం డు ఇచ్చే విధంగా బ్యాంకర్లు నగదును ఎం పీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు అందజేశారు. గ్రామ, మండల, మున్సిపల్‌, నగరపాలక సంస్థ పరిధిలో మూడు బృందాలు మూడు రోజుల పాటు వీటిని పంపిణీ చేస్తాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెన్షన్లు, పసుపు – కుంకుమ పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించారు. శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో పసుపు-కుంకుమ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Related posts