నేడు తెలంగాణ నూతన గవర్నర్గా డాక్టర్ తమిళిసై సుందరరాజన్ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణాస్వీకార నేపథ్యంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాజ్భవన్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐలాండ్ నుంచి వీవీ విగ్రహం జంక్షన్ మధ్య ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు.
ట్రాఫిక్ పరిస్థితిని బట్టి ట్రాఫిక్ మళ్లించడం, నిలిపివేయడం చేస్తామన్నారు. న్యాయమూర్తులు, మంత్రులు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెందిన వాహనాలు గేట్ నెం.3 నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వైపు, రాజ్భవన్ కమ్యూనిటీ హాల్, క్వార్టర్స్, ప్రభుత్వ స్కూల్, నర్సింగ్ కాలేజీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాహనాల పార్కింగ్కు, దిల్ఖ్షా గెస్ట్ హౌస్లో మీడియా వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.