ఈ రోజు జరిగిన లోక్ సభ సమావేశాల్లో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ కు అవార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, అభినందన్ మీసాలను ‘జాతీయ మీసాలు’గా ప్రకటించాలని కోరారు.
2జీ, బొగ్గు కుంభకోణాల్లో నిందితులెవరినైనా మీరు పట్టుకున్నారా? అంటూ బీజేపీని ఉద్దేశించి అధిర్ ప్రశ్నించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను దొంగలుగా ప్రచారం చేస్తూ మీరు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. నిజంగా వారిద్దరూ దొంగలే అయిఉంటే వారిని మీరు జైల్లో పెట్టగలిగారా? అని ప్రశ్నించారు. ఒకవేళ వారిద్దరూ దొంగలే అయిఉంటే పార్లమెంటుకు ప్రజలు ఎలా పంపించారని అధికార పక్షాన్ని నిలదీశారు.
సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు…