telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు షాక్‌.. మరోసారి ఎగిసిపడ్డ పసిడి ధరలు

బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్‌ మార్కెట్‌లో మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 పెరిగి రూ. 44,100 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 పెరిగి రూ. 48,100 కి చేరింది. ఇక బంగారం ధరలు పెరిగితే… వెండి ధరలు మాత్రం నిలకడగా నమోదయ్యాయి. కిలో వెండి ధ‌ర రూ. 73,400కి చేరింది. 

Related posts