పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల క్రితం టీఎంసీ నాయకుడు నిర్మల్ కుండును ముగ్గురు వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే కుచ్ బెహార్లో బుధవారం మరో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అజిజర్ రహ్మన్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై తృణమూల్ నాయకులు స్పందించారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు అజహర్ అలీతో పాటు ఆయన అనుచరులు రహ్మన్ను హత్య చేశారని ఆరోపించారు.
తృణమూల్ నాయకుల ఆరోపణలను బీజేపీ నాయకులు తిప్పికొట్టారు. వ్యక్తిగత సమస్యల వల్లే రహ్మన్ను హత్య చేశారని, ఇది రాజకీయ హత్య కాదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రహ్మన్ హత్యతో బీజేపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.