telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రాజెక్టు నిర్మాణాలను తప్పుబట్టిన కోదండరాం

kodandaram protest on inter students suicide

తెలంగాణలోని కొమురంభీం జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదిత ప్రాణహిత బ్యారేజి స్థలాన్ని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణాలను కోదండరాం తప్పుబట్టారు.

ప్రాణహిత ప్రాజెక్ట్‌ డిజైన్ మార్చడం ద్వారా వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని ఆరోపించారు. కాళేశ్వరం కన్నా తుమ్మిడిహట్టి బ్యారేజీ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేదని చెప్పారు. ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు సాగునీరు అందక పోవడం దారుణమని అన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహితపై బ్యారేజీ నిర్మించాలని కోదండరాం డిమాండ్ చేశారు.

Related posts