telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..దర్శనానికి 24 గంటల సమయం

tirumala temple

వేసవి సెలవులు కావడంతో తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. వెలుపల క్యూలైన్లలో సైతం భక్తులు వేచి ఉన్నారు.

స్వామి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 70,586 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.89 కోట్లు వచ్చింది.

Related posts