telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ!

tirumala temple

తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే కంపార్టుమెంటులో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ దర్శనంతో పాటు టైమ్ స్లాట్ టోకెన్లు, నడక దారి భక్తుల దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఆదివారం స్వామిని 88,024 మంది భక్తులు దర్శించుకున్నారని, సుమారు రూ. 3 కోట్ల హుండీ ఆదాయం లభించిందని తెలియజేశారు. విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలు కానున్న నేపథ్యంలోనే కొండపై రద్దీ సాధారణంగా ఉంది. మరో నెల రోజులు ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

 

Related posts