తిరుమలలో ఈ ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి నాలుగు నుంచి ఐదు గంటల వ్యవధిలో కలుగుతుందని అధికారులు తెలిపారు. రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.
కాగా, ఈ ఉదయం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి, ప్రాంతీయ అసమానతలను సృష్టించడం మంచిది కాదన్నారు. ప్రతి జిల్లా ప్రజలు తమ ప్రాంత అభివృద్ధినే కోరుకుంటారన్నారు.