telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో ‘కరోనా’ భయం.. మాస్క్ లు ధరిస్తున్న భక్తులు

tirumala temple

తిరుమలలో ఈ ఉదయం భక్తులు రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇప్పుడు కరోనా వైరస్ భయం పట్టుకుంది. నిత్యమూ లక్షలాది మంది వచ్చే తిరుమలకు వైరస్ సోకినవారు ఒక్కరు వచ్చినా, అది కొన్ని వందల మందికి వ్యాపించే అవకాశాలు లేకపోలేదు. దీంతో భక్తులు, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు ముఖానికి మాస్క్ లు ధరిస్తున్నారు.

ఇండియాలోనూ కరోనా వైరస్ వెలుగుచూసిన నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యగా నోస్ మాస్క్ లను ధరిస్తున్నట్టు భక్తులు చెబుతున్నారు. సర్వ దర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, వారికి నాలుగు గంటల్లో దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. దివ్య దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుందన్నారు.

Related posts