telugu navyamedia
సామాజిక

శ్రీవారి భక్తులకు శుభవార్త

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. రోజుకు 2వేల సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్లలో టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించన్నట్లు తితిదే స్పష్టం చేసింది.

కరోనా రెండో దశ ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలలో సర్వదర్శన టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. కేవలం ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను పరిమిత సంఖ్యలో ఇప్పటివరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ విషయంలో పలు విమర్శలు వెల్లువెత్తడంతో కరోనా నిబంధనలు అనుసరిస్తూ చిత్తూరు జిల్లా భక్తులు మాత్రమే సర్వదర్శనం చేసుకునేందుకు వీలుగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. గతంలో నిత్యం 8వేల సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసేది.

 

Related posts