telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు… హీరో సూర్య తండ్రిపై కేసు నమోదు

Surya

తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ)పై ప్రముఖ తమిళ నటుడు సూర్య తండ్రి శివకుమార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో డబ్బులున్న వారికే దర్శనాలు కల్పిస్తారని, గెస్ట్‌ హౌస్‌లు ఇస్తారని మండిపడ్డారు. సామాన్యులకు కనీసం దర్శనం కల్పించకుండా తోసేస్తారని శివకుమార్‌ వాపోయారు. అలాంటి ఆలయంలోకి ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. దీనిపై శ్రీవారి భక్తుడు తమిళ్ మయ్యన్ శివ కుమార్‌పై ఈ మెయిల్ ద్వారా టీటీడీకి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీటీడీపై శివకుమార్‌ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీనిపై ఏప్రిల్ 29న శివకుమార్‌పై కేసు నమోదైందని టీటీడీ వెల్లడించింది. అలాగే అలాగే శ్రీవారి ఆలయ చరిత్ర, టీటీడీపై దుష్ప్రచారం చేసిన మరో 8 మందిపై కూడా కేసులు పెట్టినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక జూన్ 30వ తేదీ వరకు శ్రీవారి దర్శనాలు రద్దంటూ సోషల్‌ మీడియా, పత్రికలో అసత్య ప్రచారం చేసిన ముగ్గురిపై, రెండు పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీడీపీ తెలిపింది. ఎపిడమిక్ డిసీజెస్ చట్టం ద్వారా వీరిపై కేసు నమోదైంది. కాగా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన వారిపై చర్యలకు వెనకాడేది లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై తిరుమల డీఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయం, భక్తుల‌పై వివాదస్పద పదజాలం వాడిన తమిళ నటుడు శివకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే తెలుగు ఎథిస్ట్ ఫేస్ బుక్ పేజీపైనా కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.

Related posts