ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. తిరుమల కొండపై ప్లాస్టిక్ వినియోగం బాగా ఎక్కువైంది. దీనిని అరికట్టేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా ప్రసాదం లడ్డూ పంపిణీకి ఇకపై జ్యూట్ బ్యాగులను మాత్రమే వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది.
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల కొండపై ప్లాస్టిక్ కవర్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. అన్నీ వస్తువుల కోసం అధికంగా ప్లాస్టిక్ నే వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని నిషేదించే దిశగా టీటీడీ చర్యలు తీసుకుంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం వల్ల మూడు నెలల్లోనే రాష్ట్రం దివాళా: ఎంపీ రామ్మోహన్ నాయుడు