టిక్టాక్ ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించవచ్చని యాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ నితిన్ సలూజ తెలిపారు. ప్రభుత్వ పీఆర్వోల సదస్సులో ఆయన మాట్లాడుతూ, సమాచార భద్రత, వినియోగం, ఫిర్యాదుల పరిష్కారానికి యాప్లోనే ప్రత్యేక వ్యవస్థను పొందుపరిచామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ విషయాలు, పథకాలను ప్రచారం చేస్తోందని ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తెలిపారు. ఫేస్బుక్, గూగుల్, ట్విటర్ తదితర సామాజిక మీడియా వినియోగంపై ప్రభుత్వ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.