telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

టిక్‌టాక్ తో మరో యువకుడు మృతి

New couples attack SR Nagar

టిక్‌టాక్ ఆప్ తో ఎదరో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా టిక్‌టాక్ కోసం స్టంట్ చేయబోయి మరో యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సంగారెడ్డికి చెందిన నరసింహ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని దూలపల్లిలో ఉండే తన బంధువుల ఇంటికి వెళ్లాడు. నిన్న సాయంత్రం అక్కడికి దగ్గరలో ఉన్న చెరుకు వద్దకు వెళ్లి టిక్‌టాక్ చేసేందుకు ప్రయత్నించాడు.

తన బంధువైన ప్రశాంత్ వీడియో తీస్తుండగా నరసింహ చెరువులోకి దిగి పాటలు రికార్డ్ చేశాడు. ఇంకా క్లారిటీగా ఉండాలని మరోసారి నరసింహ చెరువులోకి వెళ్లాడు. అయితే అక్కడ కుంట ఉండటంతో దానిలోకి జారిపోయాడు. కుంట లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలోకి దిగేందుకు ఎవరూ సాహసించలేదు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా గజ ఈతగాళ్ల సాయంతో నరసింహ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts