telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టైగర్‌ ష్రాఫ్‌, దిశాపటాని ఒకే ఇంట్లో లేరు… సోదరి కృష్ణ ష్రాఫ్‌

tiger

లాక్‌డౌన్‌ సమయంలో బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌, దిశాపటాని కలిసి నివసిస్తున్నారన్న వార్తలపై టైగర్‌ సోదరి కృష్ణ ష్రాఫ్‌ స్పందించారు. వారిద్దరూ ప్రస్తుతం కలిసి జీవించడం లేదని కృష్ణా స్పష్టం చేశారు. మిజోరాంలో నివసిస్తున్న కృష్ణ ష్రాఫ్‌ లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం అన్నయ్య టైగర్‌, ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌‌తో కలిసి ముంబైలో జీవిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దిశా తమతో కలిసి లేదని అన్నారు. అయితే తమ ఇంటి సమీపంలోనే నివసిస్తుందని తరుచుగా ఆమెను కలుస్తామని వెల్లడించారు. దిశా పటాని, టైగర్‌ మధ్య సన్నిహిత్యం గురించి మాట్లాడుతూ.. దిశా, టైగర్‌ మంచి స్నేహితులని, దిశాతో తమ కుటుంబమంతా బాగా కనెక్ట్‌ అయ్యామని తెలిపారు. అన్నయ్యను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతోందన్నారు. ఇక అన్నయ్య గురించి చెబుతూ సినిమా షూటింగ్‌ల కారణంగా ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండలేక పోయేవాళ్లం. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు టైగర్‌తో ఎక్కువ సమయం గడపడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మా మధ్య బంధం మరింత మెరుగు పడింది. అని టైగర్‌ గురించి చెప్పుకొచ్చారు సోదరి కృష్ణ ష్రాఫ్‌.

 

View this post on Instagram

 

This is how we do it #quarintinelife @kishushroff 👭🤣

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Related posts