telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆ జిల్లాలో పులి దాడికి మరొకరు బలి…

tiger killed and eaten a man

మన రాష్ట్రంలో పులులు ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లలో కనిపిస్తాయి. అయితే తాజాగా కొమురం భీం జిల్లాలో గత కొన్ని రోజులుగా పులి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది… ఈ సారి యువతిపై దాడి చేసింది పులి… ఈ దాడిలో యువతి అక్కడికక్కడే మృతిచెందింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పెంచికలపేట మండలం కొండపల్లికి చెందిన నిర్మల అనే యువతి.. పత్తి చేనులోకి వెళ్లింది.. కొండపల్లి సమీపంలో ఈ పత్తి చేను ఉంది.. అయితే, ఆ యువతిపై పులి దాడి చేసి చంపేసినట్టు స్థానికులు చెబుతున్నారు.. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు అటవీశాఖాధికారులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత.. యువతి పులి దాడిలోనే చనిపోయిందా..? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేదానిపై క్లారిటీ ఇవ్వనున్నారు అధికారులు. కాగా, ఈ నెల  11న దహేగాం మండలం దిగిడలో యువకుడిపై దాడి చేసిన పులి.. ఆ యువకుడిని చంపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలకు ఏదో ఒక శాశ్వత పరిష్కారం చూడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Related posts