telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

టికెట్ అనుసంధానం .. ఏప్రిల్ నుండే..

ticket linking will start from april in trains

సుదరం ప్రయాణం చేసే వారికి లేదా వారివారి గమ్య స్థానాలకు డైరెక్ట్ ట్రైన్ లేని వారికి, అలాగే అలాంటి ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ రెండు గమ్యస్థానాలకు టికెట్లను అనుసంధానం చేసే కొత్త విధానాన్ని అమలుచేయనున్నది. ఈ సదుపాయం ఏప్రిల్1 నుంచి అమలవుతుంది. దూరప్రాంతాలకు వెళ్లే వారు సాధారణంగా ఒకటికంటే ఎక్కువ రైళ్లకు టికెట్లు బుక్‌చేసుకొంటారు. కొన్నిసమయాల్లో కనెక్టింగ్ రైలు మిస్సయితే టికెట్‌ను రద్దు చేసుకోవడం కష్టమవుతున్నది. దీనిని అధిగమించడానికి రైల్వేశాఖ రెండు ప్రయాణ టికెట్లను లింకింగ్‌ చేసే సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.

దీనిపై ప్రయాణికుల నుండి వచ్చిన అనేక విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనితో గతంలో టికెట్ రద్దు తదితర సమస్యల నుండి ప్రయాణికులు బయటపడ్డట్టే. రోజు ఉగ్యోగల కోసం ప్రయాణాలు చేసే కోట్లాది మందికి ఈ సదుపాయం ఉపయోగపడనుంది.

Related posts