telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బోయినపల్లి : … ఆత్మత్యాగానికి సిద్దమవుతున్న .. తెరాస నేతలు.. సీటుకోసమేనా..

ticket issue raised in trs for local elections

టీఆర్‌ఎస్‌ నుంచి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్‌, పోచంపల్లి, తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, బోడుప్పల్‌, ఘట్కేసర్‌, పోచారం మున్సిపాల్టీలతో పాటు ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, బోడుప్పల్‌ కార్పొరేషన్లకు చెందిన ఆశావాహులు కొందరు టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ కోసం మంత్రి మల్లారెడ్డిని కలిసేందుకు బోయినపల్లిలోని ఆయన ఇంటికి చేరుకోగా మరికొందరు ఆశావాహులు మల్లారెడ్డి గార్డెన్‌కు చేరుకుని మంత్రి పిలుపుకోసం ఎదురు చూశారు. మంత్రి మల్లారెడ్డి తన కార్యాలయంలో మంతనాలు సాగిస్తుండగా ఇంతలో ఓ ఆశావాహుడు తనకు టికెట్‌ రాదని తెలుసుకుని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని హల్‌చల్‌ చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న మంత్రి తన ఇంటి వెనక డోర్‌ నుంచి వెళ్లిపోయి మకాం మల్లారెడ్డి గార్డెన్స్‌కు మార్చారు. దీంతో మల్లారెడ్డి గార్డెన్స్‌ ఆశావాహులతో కిటకిటలాడింది. ఒక్కొక్కరిని పిలిచి ఒకవైపు మంత్రి మల్లారెడ్ది, మరొక పక్కన ఆయన అల్లుడు టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి సమావేశమయ్యారు. పోటీదారులు ఎక్కువగా ఉన్నందున సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు పలువురు ఆశావాహులు తెలిపారు. కాగా ‘డబ్బులెన్ని ఉన్నాయి.. ఎంత ఖర్చు పెట్టుకుంటావ్‌..’ అంటూ వారు ఆరా తీసినట్లు కొందరు చెప్పారు.

Related posts