ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి స్పందించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా సమావేశాలు కొనసాగడం లేదని అన్నారు. సమావేశాలు జరుగుతున్న తీరు సరిగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు.పొద్దు పోక, నిద్ర రాక సమావేశాలను జరుపుతున్నట్టుగా ఉందని చెప్పారు.
ఎన్ కౌంటర్ విషయంలో కేసీఆర్ కు జగన్ హ్యాట్సాఫ్ చెప్పడం మంచిదేనని అన్నారు. అయితే ముందు మన రాష్ట్రం గురించి చెప్పిన తర్వాత పక్క రాష్ట్రం గురించి చెప్పాలని సూచించారు. వైయస్ వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసులు ఏమయ్యాయని తులసిరెడ్డి ప్రశ్నించారు.