telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

భువనగిరిలో మూడేళ్ళ బాలిక కిడ్నాప్.. తల్లికి మత్తు ఇచ్చి దారుణం

యాదాద్రి-భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భువనగిరి పట్టణంలో మూడేళ్ళ బాలికను కిడ్నాప్ చేసింది ఓ దొంగల ముఠా. ఏకంగా తల్లికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి బాలికను దుండగులు అపహరించుకు పోయారు. వివరాల్లోకి వెళితే..మహబూబ్ నగర్ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వెళ్ళాడు. అయితే..నాలుగు రోజులైనా తిరిగి రాకపోవడంతో వెతుక్కుంటూ మూడేళ్ళ కూతురిని వెంటబెట్టుకుని హైదరాబాద్ వెళ్ళింది భార్య మహేశ్వరి. ఇదే అదునుగా చూసుకొని హైదరాబాద్ ఎంజీబీఎస్ లోనే భర్త దగ్గరకు తీసుకెళ్తామని మాయ మాటలు చెప్పి భువనగిరికి తీసుకొచ్చింది కిడ్నాప్ ముఠా. అంతటితో ఆగకుండా మూడేళ్ళ బాలికను కిడ్నాప్ చేసింది ఆ దొంగల ముఠా. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ఆ తల్లి..పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఇది తెలిసిన వాళ్ళు చేశారా..లేక దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Related posts