కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. చామరాజపేటలోని ఓ భవనంలో భారీ పేలుడు జరగడంతో అక్కడక్కడే ముగ్గురు సజీవ దహనం అయ్యారు. పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిద్రమయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు దగ్గరలోని విక్టోరియా హాస్పిటల్కు తరలించారు. ఓ గౌడౌన్లో బాణసంచాను తరలిస్తుండగా.. ఈ పేలుడు సంభవించిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలియజేశారు.
కాగా.. పేలుడు తీవ్రతకు డెడ్బాడీస్ 100 మీటర్ల దూరానికి ఎగిరి పడటమే కాకుండా.. సమీపంలో ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కన భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. సమాచారం తెలియగానే వి.వి.పురం పోలీసులు వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ సంజీవ్ పటేల్ ఘటనాస్థలానికి హుటాహుటిన ఘటనా స్థాలానికి చేరుకుని పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశంలో ఈ పేలుడు జరగడంతో ఆ శబ్దానికి స్థానికులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసినట్టు తెలుస్తోంది.