telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మరో మూడు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు

ys jagan cm

ఆర్థికంగా ఆదుకునేందుకు ఇప్పటికే పలు కులాలకు ఏపీ సర్కారు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాల వెల్ఫేర్ కార్పొరేషన్, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్, రెల్లి వెల్ఫేర్ కార్పొరేషన్లను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ మూడు కులాలను ఆర్థికంగా ఆదుకునేందుకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆయా కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో ఆర్థికంగా అభివృద్ది చెందే అవకాశం ఉంది. మాదిగల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తానని గతంలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related posts