telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాతకు .. బెదిరింపులు..

threaten calls to bollywood producer

ఇటీవల నిర్మాత అనురాగ్‌ కాశ్యప్‌, జై శ్రీరామ్‌ యుద్ధ నినాదంగా మారిందంటూ ప్రధాని మోడీకి లేఖ రాసిన నేపథ్యంలో బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్‌లో తనకు వచ్చిన బెదిరింపులపై ముంబయి క్రైం బ్రాంచిలోని సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కాశ్యప్‌ శనివారం ఫిర్యాదు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాశ్యప్‌కు గురువారం ట్విట్టర్‌లో బెదిరింపులు వచ్చాయని, దీనిపై దర్యాప్తు ప్రారంభించామని ఆయన తెలిపారు.

దేశంలో జరుగుతున్న మూక దాడులు, హిసాత్మక సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల సినీ ప్రముఖులు పలువురు మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసింది. ఆ లేఖపై సంతకం చేసిన వారిలో అనురాగ్‌ కాశ్యప్‌ కూడా ఉన్నారు. జై శ్రీరామ్‌ యుద్ధనినాదంగా మారిందని, దేశంలో శాంతి భద్రతలకు కారణమవుతుందని ఆ లేఖలో వారు పేర్కొన్నారు.

Related posts