telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

పోలీస్టేషన్ కే …కన్నం… ఆలస్యంగా గుర్తించిన అధికారుల..తెలివితేటలు..

mobile phone theft in telangana

ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కే కన్నం వేశారు దొంగలు. స్టేషన్‌ను ఆనుకుని ఉన్న స్టోర్‌ రూంలో విలువైన వస్తువులను అహపరించారు. చోరీ జరిగిన విషయాన్ని ఓ రోజైతేగాని పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. ఈ స్టేషన్‌ పరిధిలో స్టోర్‌ రూం ఉంది. వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కార్లు, ఇతర విలువైన వస్తువులను ఈ స్టోర్‌ రూంలో భద్రపరుస్తుంటారు.

అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్టోర్‌ రూంలోకి చొరబడి 90 బ్యాటరీలు, రెండు గ్యాస్‌ సిలెండర్లు, సీసీ టీవీ కెమెరాలు, కార్లలోని విడి భాగాలు ఎత్తుకెళ్లారు. తరువాత రోజు ఉదయం వరకు ఈ చోరీని ఎవరూ గమనించ లేదు. ఆ రోజు ఉదయం స్టోర్‌ ఇన్‌చార్జి గది వద్దకు వెళ్లగా తాళం పగులగొట్టి ఉండడం గమనించారు. దీనితో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన దుండగులు మొత్తం నలుగురు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts