గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. చాలాకాలం తరువాత తర్వాత హిందీలో “ది స్కై ఈజ్ పింక్” అనే చిత్రంలో నటిస్తుంది. ఫర్హాన్ అక్తర్ కథానాయకుడిగా నటిస్తున్నారు. చిన్న వయసులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అసలు బ్రతకడమే కష్టమని డాక్టర్స్ చెప్పినా మోటివేషనల్ స్పీకర్గా, ఒక పుస్తక రచయితగా కూడా తన ప్రతిభ చాటుకున్న అయేషా చౌదరి కథని తీసుకొని ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయేషా పాత్రలో జైరా కనిపించనుండగా, వయసులోని వివిధ దశలలో ప్రియాంక లుక్స్ ఉండనున్నట్టు తెలుస్తుంది. ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రాలు 2005లో దిల్ దఢ్ఖనే దో అనే చిత్రంతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాగా, ది స్కైజ్ ఈజ్ పింక్ వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రం. ఇందులో ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలోనే కాకుండా నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంలో జైరా వసీమ్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ప్రియాంక తల్లిగా జరీనా నటిస్తుంది. అక్టోబర్ 11,2019న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. సెప్టెంబర్ 5 నుండి 15 వరకు టోరంటోలో జరిగే అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్న ఏకైక ఏషియన్ సినిమా ఇదే కావడం విశేషం.
previous post