యంగ్ హీరో రాజ్తరుణ్ కథానాయకుడిగా లక్ష్మీరాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. పూర్తి ఎంటర్టైన్మెంట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. నేటి నుంచి సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత కేకే రాధామోహన్ మాట్లాడుతూ.. తొలి షెడ్యూల్ పూర్తయిందని, శనివారం నుంచి రెండో షెడ్యూల్ మొదలైనట్టు తెలిపారు. నాన్స్టాప్గా ఈ షెడ్యూల్ను పూర్తిచేయనున్నట్టు పేర్కొన్నారు. రాజ్తరుణ్ ఎనర్జీకి తగిన క్యూట్ లవ్స్టోరీ ఇదని రాధామోహన్ తెలిపారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సెన్సిటివ్ లవ్స్టోరీని రూపొందించిన కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్న చిత్రం ఇదని పేర్కొన్నారు. నంద్యాల రవి డైలాగ్స్ చాలా చక్కగా రాశారని ప్రశంసించారు. సీనియర్ నటి వాణీవిశ్వనాథ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ బ్యానర్లో ఇది మరో సూపర్హిట్ సినిమా అవుతుందని వివరించారు.
రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ల, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కేకే రాధామోహన్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: కొండా విజయ్కుమార్.