వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా “మహర్షి” సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజాహెగ్డే నటిస్తుండగా, అల్లరి నరేష్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమాస్, వైజయంతి మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది మహేష్ బాబు నటిస్తున్న 25వ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా “సూపర్స్టార్తో ఫ్రెండ్షిప్ సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంకండి” అంటూ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ట్వీట్ చేశారు. “మహర్షి” మ్యూజికల్ జర్నీ మొదలు కాబోతోందని, మార్చ్ 29న ఉదయమా 9.00 గంటలకు మొదటి పాట “చోటి చోటి బాతే”ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు మహేష్ బాబు, పూజ హెగ్డే, అల్లరి నరేష్ కలిసి ఉన్న పోస్టర్ ను షేర్ చేశారు ఆయన. ఇక ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
The Musical Journey of #Maharshi begins on 29th March at 9:09 a.m.. Get ready to celebrate your Friendship with our SuperStar @urstrulyMahesh, @hegdepooja & @allarinaresh with #ChotiChotiBaatein… A @ThisIsDSP Musical. @KUMohanan1 @ShreeLyricist #MAHARSHI1stSINGLEonMARCH29th pic.twitter.com/ZcLsNtvaa7
— Vamshi Paidipally (@directorvamshi) March 27, 2019
కాలం అనుకూలిస్తే ఆ పని కూడా చేస్తా… : ప్రియాంక చోప్రా