telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

దారుణం: కన్నతల్లిని చంపి.. చితిపై చికెన్ కాల్చుకొన్నాడు….

crime

ఈ ఏడాది తొలి మాసంలోనే దారుణాతిదారుణమైన ఘటనలు జరిగాయి. ఏపీలోని మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం సభ్యులు… ఒకరకమైన మూఢత్వంలోకి వెళ్లిపోయారు. ఉన్మాదభక్తితో కన్నప్రేమను మర్చిపోయారా తల్లిదండ్రులు. కడుపున పుట్టిన పిల్లల్ని… కర్కషంగా చంపేశారు. అయితే.. ఈ ఘటన మరువకముందే.. మరో దారుణం జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని పశ్చిమ సింఘ్‌భూమ్‌ జిల్లాలో దేశం నివ్వరపోయే ఈ ఘటన చోటు చేసుకుంది. సుమి సోయ్‌ తన కొడుకు ప్రధాన్‌ సూయ్‌తో ఒకే ఇంట్లో జీవిస్తోంది. మద్యానికి బానిసైన కొడుకు ప్రధాన్‌ సోయ్‌… తల్లి సంపాదించిన డబ్బుతో నిత్యం మద్యం సేవించి జల్సాలకు అలవాటు పడ్డాడు. తాగుడు మానేయాలని తల్లి సుమి సోయ్‌ ఎంత చెప్పినా.. కొడుకు అసలు పట్టించుకోకుండా అలాగే వ్యవహరించాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో.. కొడుకును ఆ తల్లి మందలించింది. దీంతో ఆ తల్లి పట్ల ఆ దుర్మార్గుడు ప్రధాన్‌ సోయ్‌ క్రూరంగా ప్రవర్తించాడు. కన్న తల్లి అని చూడకుండా కర్రతో ఆమె తలపై బలంగా కొట్టి దారుణంగా చంపాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులను చితిగా పేర్చి…. ఆమె మృతదేహానికి మంట పెట్టాడు. అక్కడితో ఆగకుండా ఆ చితిపైనే చికెన్‌ కాల్చుకుతిన్నాడు ఆ రాక్షసుడు. మత్తు దిగిన తర్వాత.. ఆ మృతదేహం పూర్తిగా కాలకపోవడం గమనించాడు. దీంతో ఇంట్లో ఉన్న స్టౌవ్‌ సహాయంతో కాల్చే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే అతని సోదరి వచ్చి… పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రధాన్‌ సోయ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Related posts