అక్కినేని ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరు సింగిల్ ఫ్రేములో కనిపించి కనువిందు చేశారు. అఖిల్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడంతో ఫుల్ వైరల్ అయింది. నాగార్జున, అమల, అఖిల్, సుశాంత్, సుమంత్, సుప్రియ, నాగసుశీలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. అయితే వీరంతా ఇలా ఒకేచోట చేరడానికి గల కారణం ఏంటంటే… నాగార్జున సోదరుడు అయిన వెంకట్ కుమారుడు ఆదిత్య నిశ్చితార్ధం ఐశ్వర్యతో చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుక కోసం అక్కినేని ఫ్యామిలీ అంతా చెన్నైలో ప్రత్యక్షం అయింది. వెడుకలో అక్కినేని గ్యాంగ్ అంతా ఓకే చోట చేరడంతో ఆ వేడుకకి ఎంతో కళ వచ్చింది. అయితే అసమంత.. ది ఫ్యామిలీ మేన్ అనే వెబ్ సిరీస్ షూటింగ్తో బిజీగా ఉండడం వలన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిందని సమాచారం. ఏఎన్ ఆర్, సమంత ఉంటే ఈ ఫోటో మరింత కళగా ఉండేదని నెటిజన్స్ చెబుతున్నారు.
previous post