“యాంగ్రీ బర్డ్స్” గేమ్ తో పాటు సినిమాలు కూడా వచ్చి ప్రేక్షకులను అలరించిన విషయం అందరికీ తెలిసిందే. కంప్యూటర్ యానిమేటెడ్ యాక్షన్ కామెడీగా రోవియో ఎంటర్టైన్మెంట్స్ “యాంగ్రీ బర్డ్స్” సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా మొదటి పార్ట్ 2016లో విడుదలైంది. థురోప్ వాన్ ఓర్మాన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది.
“యాంగ్రీ బర్డ్స్-2” ట్రైలర్ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఎప్పుడూ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండే కోపిష్టి పక్షులు, పందులు ఈ సీక్వెల్లో మిత్రులై పోయినట్టు ట్రైలర్ లో చూపించారు. జటా (పర్పుల్ బర్డ్)… పక్షులు, పందుల స్థావరాలపై మంచు గడ్డలతో దాడి చేస్తాయి. దాంతో వాటి ఆటలను ఎలాగైనా కట్టించాలని లియోనార్డ్ (పంది), రెడ్ (పక్షి) ఇంటికి వెళ్లి జటాను ఎలాగైనా కట్టడి చేయాలని అడుగుతుంది. దీంతో స్నేహితులుగా మారిన వారిద్దరూ జటా ఆటను ఎలా కట్టించారు అనేది సినిమాలో చూడాలి. ఈ చిత్రం ఆగస్ట్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ ను మీరు కూడా చూసేయండి మరి.