గురువారం ఉదయం పార్క్ హయత్లో జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ‘మా’ లో నెలకొన్న విబేధాలపై రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా)లో జరుగుతున్న పరిణామాలపై డైరీ ఆవిష్కరణ సభలో రాజశేఖర్ అసంతృప్తిని వెల్లడించారు. అయితే నిన్న రాజశేఖర్ ప్రవర్తించిన తీరుపట్ల మోహన్బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్ తదితరులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజశేఖర్ ప్రవర్తనపై చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆధిపత్యం కోసమే ఈ గొడవలు జరుగుతున్నాయని, పెద్దల ముందు ఇవి బయట పడటం వల్ల ఇప్పటికైనా సమసిపోతాయని భావిస్తున్నానని ఆయన అన్నారు. గొడవ ఎవరు, ఎందుకు చేశారు? అని ఆలోచించకుండా పరిష్కారం ఆలోచించాలని ఆయన సూచించారు. చిరంజీవి ముందుండి అసోసియేషన్ నడిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
previous post
చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్…