telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మరోసారి కాల్పులు.. మేజర్, నలుగురు జవాన్లు మృతి..

terrorist firings in pulvama in kashmir

పుల్వామా లో భారీ ఉగ్రదాడి మరువక ముందే మరోసారి దక్షిణ కాశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులలో ఒక మేజర్, నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు. ఉగ్రవాదులు-భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

పుల్వామా ఘటనలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది మృతి చెందిన విషయం తెల్సిందే. దేశంలో ఇదే రెండవ అతిపెద్ద ఆత్మాహుతి దాడిగా అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే దేశం మొత్తం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అందరూ ఏకకంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని డిమాండ్ చేస్తుండటం విశేషం. కాగా, ఈ దాడిలో మృతిచెందిన వారికి ప్రజలు దేశవ్యాప్తంగా కొవొత్తులతో నివాళులు అర్పించారు.

Related posts