పుల్వామా లో భారీ ఉగ్రదాడి మరువక ముందే మరోసారి దక్షిణ కాశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులలో ఒక మేజర్, నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు. ఉగ్రవాదులు-భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
పుల్వామా ఘటనలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది మృతి చెందిన విషయం తెల్సిందే. దేశంలో ఇదే రెండవ అతిపెద్ద ఆత్మాహుతి దాడిగా అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే దేశం మొత్తం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అందరూ ఏకకంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని డిమాండ్ చేస్తుండటం విశేషం. కాగా, ఈ దాడిలో మృతిచెందిన వారికి ప్రజలు దేశవ్యాప్తంగా కొవొత్తులతో నివాళులు అర్పించారు.