telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జవాన్ల మృతి మనసును కలచివేసింది: పవన్ కల్యాణ్

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల మృతి తన మనసును కలచివేసిందన్నారు. ఉగ్రవాదులది హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసిందన్నారు. మృతుల సంఖ్య పెరుగుతుండడం మరింత బాధ కలిగిస్తోందన్నారు.

అమర వీరులకు జన సైనికుల తరపున సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. జవాన్ల త్యాగాలను భరత జాతి ఎప్పటికీ మర్చిపోదని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు దేశం యావత్తు అండగా నిలవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఉగ్రవాదులు చొరబడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉందని పవన్ అన్నారు.

Related posts