దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి తెలంగాణ కూడా ఆచితూచి అడుగులేస్తోంది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలను దశలవారీగా తెరవాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా జూలై 5 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. పది పరీక్షల తర్వాతే స్కూల్స్ రీ-ఓపెన్ చేయాలని భావిస్తున్నారు.
అయితే ఒకేసారి కాకుండా మొదటగా 8, 9, 10 తరగతులు ప్రారంభించాలని, ఆ సమయంలో ఏవైనా భద్రతాపరమైన సమస్యలు ఎదురైతే, వాటిని సరిదిద్దుకుని 6, 7 తరగతులను ప్రారంభించనున్నారు. ప్రాథమిక పాఠశాలలను మాత్రం మరింత ఆలస్యంగా తెరవనున్నారు.